టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత ముగియనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రావిడ్ పదవీ కాలాన్ని ఇక పొడిగించకూడదని, అతడి స్థానంలో టీమిండియా మాజీ క్రికెటర్, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్కు కోచింగ్ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన బిసిసిఐ సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.