ఐర్లాండ్​ టూర్​కు కోచ్​గా లక్ష్మణ్​

By udayam on May 18th / 12:45 pm IST

వచ్చే నెల 26 నుంచి ఐర్లాండ్​లో పర్యటించనున్న భారత్​ జట్టుకు ప్రధాన కోచ్​గా వివిఎస్​ లక్ష్మణ్​ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో భారత ఎ జట్టు స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్న టి20 సిరీస్​ ఆడనుంది. దీంతో ఐర్లాండ్​ పర్యటనకు భారత్​ తన బి టీమ్​ను వివిఎస్​ లక్ష్మణ్​ కోచ్​గా పంపనుందని సమాచారం. ద్రవిడ్​ బాధ్యతల్ని మోయడానికి ఎన్​సిఎ హెడ్​ లక్ష్మణ్​ సైతం సుముఖత వ్యక్తం చేసినట్లు బిసిసిఐ అధికారులు క్రిక్​ ట్రాకర్​ వెబ్​సైట్​కు వెల్లడించారు.

ట్యాగ్స్​