ఆంధ్రప్రదేశ్ లో ఈవెంట్లకు, సభలకు కొత్త రూల్స్ వచ్చిన నేపధ్యంలో సినిమా ఫంక్షన్లకూ వీటితో పెద్ద చిక్కే వచ్చి పడుతోంది. నిన్ననే బాలయ్య మూవీ ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే స్థలాన్ని ఒంగోలులోని ఏబీఎం కాలేజ్ గ్రౌండ్స్ నుంచి అర్జున్ ఇన్ ఫ్రా గ్రౌండ్స్ కు మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా చిరంజీవి మూవీ ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా వేదిక మార్పు జరిగింది. ఆర్కే బీచ్ లో ఇప్పటికే ఈ ఈవెంట్ కు పనులు పూర్తి కాగా ఇప్పుడు వీటిని అక్కడ నుంచి తొలగించి ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కు వేదికను మార్చారు.