మెగాస్టార్ చిరంజీవి, బాబీ, రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ వచ్చే ఏడాది జనవరి 4న విడుదలకానుందని సమాచారం. ఇప్పటికే ట్రైలర్ కట్ పనులు వేగంగా జరుగుతున్నట్లు టాక్. జనవరి 8న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో నిర్వహించనున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. సంక్రాంతి సందర్భంగా వచ్చే జనవరి 13న ఈ మూవీ ధియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీకి నిర్మాతలు.