ఒకరే నిర్మాతలు.. ఇద్దరు బడా స్టార్లు.. వారిద్దరి మూవీస్ రిలీజ్ కూడా ఒకేసారి. ఇలాంటి తలనొప్పి ఏ ప్రొడ్యూసర్ కూ ఉండకూడదు అనుకుంటున్నారట మైత్రీ మూవీ మేకర్స్. ఎందుకంటే వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ ను ఫుల్ స్వింగ్ లో కానిచ్చేస్తున్న మైత్రీ వాళ్ళు.. బాలయ్య మూవీని పట్టించుకోవడం లేదని ఫ్యాన్స్ నుంచి వార్నింగ్స్ వస్తున్నాయట. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మైత్రీ వాళ్ళు సొంతంగా రిలీజ్ చేస్తున్న వీర సింహారెడ్డి చిత్రానికే.. వీరయ్య కంటే ఎక్కువ ధియేటర్లు ఇస్తున్నారని సమాచారం. ఈ వార్తతో అన్నా బాలయ్య అభిమానులు కాస్త శాంతిస్తారేమో చూడాలి.