19 ఏళ్ళ వయసులో రాజీవ్ గాంధీ హత్య కేసులో అరెస్ట్ అయి 31 ఏళ్ళ పాటు జైలు జీవితం గడిపిన ఎజి పెరరివాలన్ విడుదలైన నేపధ్యంలో ఆమె తల్లి అర్పుదమ్మాళ్ అతడికి వివాహం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు అతడు సైతం వివాహానికి అంగీకరించాడు! ఈ ఏడాది మార్చిలో బెయిల్పై బయటకొచ్చిన పెరరివాలన్ను.. తక్షణం విడుదల చేయాలని నిన్న సుప్రీంకోర్టు ఆదేశించింది. 1991 మే 21న రాజీవ్ గాంధీ హత్యకు ఉపయోగించిన మానవ బాంబు బ్యాటరీని పెరరివాలన్ కొన్నాడు.