పశ్చిమ దేశాలే ఉక్రెయిన్ యుద్ధానికి మూల కారకులని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పుకొచ్చాడు. నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ మిత్ర దేశాల విజయానికి చిహ్నంగా ప్రతీ ఏటా మే 9న జరిగే విక్టరీ డే సందర్భంగా మాట్లాడిన పుతిన్ ఈ తమ భూభాగం మీద దాడి చేసేందుకు వెస్ట్ కంట్రీలు సిద్ధమవుతున్నాయని ఆరోపించాడు. డోన్బస్ రీజియన్లో రష్యా బలగాలు, వలంటీర్లు మాతృభూమి కోసం పోరాడుతున్నారని, యుద్ధంలో మరణించిన కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన చెప్పుకొచ్చాడు.