యువ క్రికెటర్ రిషబ్ పంత్ కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన తర్వాత ఇప్పుడు ఐపిఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎవరు కెప్టెన్సీ వహిస్తారన్నది పెద్ద ప్రశ్న ఎదురవుతోంది. మరో మూడు నెలల్లో ప్రారంభం కానున్న ఈ సిరీస్ కు పంత్ పూర్తి ఫిట్ నెస్ సాధించే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ అతడు ఈ సిరీస్ కు దూరంగా ఉన్నట్లయితే ఆ జట్టులోని ఆసీస్ సీనియర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఢిల్లీకి కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అతడి తర్వాత భారత ప్లేయర పృధ్వి షా, ఆసీస్ ప్లేయర్ మిచెల్ మార్ష్ కు.. కోచ్ పాంటింగ్ పగ్గాలు ఇవ్వనున్నాడని సమాచారం.