కాంతార, కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్లను ఇచ్చిన కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో టాలెంటెడ్ డైరెక్టర్ ఇప్పుడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవల శివరాజ్ కుమార్ తో మఫ్తీ వంటి బ్లాక్ బస్టర్ తీసిన డైరెక్టర్ నర్తన్ చెప్పిన కథకు హీరో రామ్ చరణ్ ఫిదా అయినట్లు తెలుస్తోంది. దీంతో అతడిని మొత్తం స్క్రిప్ట్ సిద్ధం చేయమని రామ్ చరణ్ సూచించాడట. ఇక ఈ మూవీని యువీ క్రియేషన్స్ వాళ్ళు పాన్ ఇండియా లెవల్లో తీయనున్నారని టాక్.