విజయవాడలో ఓ వివాహితను రెండు రోజుల పాటు బంధించి ఆపై అత్యాచారం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం సెల్ఫోన్ షాపులో పనిచేస్తున్న ఓ మహిళను అక్కడే పనిచేస్తున్న రమేష్ బాబు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి ఓ ఇంటికి తీసుకెళ్లి అక్కడ 2 రోజుల పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం గత నెల 7న ఆమె అతడి చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరి భర్తకు విషయం చెప్పింది. దీనిపై ఇటీవల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.