భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మృతి పట్ల ప్రపంచ నేతలు సంతాపం ప్రకటించారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, నేపాల్ ప్రధాని ప్రచండ, పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ లు మోదీకి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీలంక మాజీ ప్రధాని మహీంద రాజపక్సే, నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేబా సైతం ప్రధానికి సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా పలు రాజకీయ నాయకులు, వివిధ రాష్ట్రాల సిఎంలు ప్రధానికి సంతాపం తెలిపారు.