భారత్లో మనీ లాండరింగ్కు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనా మొబైల్ దిగ్గజం షియామీ అందులో చాలా వరకూ అమెరికా కంపెనీ క్వాల్కమ్కు తరలించిందని సమాచారం. తన మొబైల్స్లో వాడే క్వాల్కమ్ చిప్స్ కోసం రూ.4,663.1 కోట్లను స్నాప్డ్రాగన్ కంపెనీకి చెల్లించింది. స్టాండర్డ్ ఎసెన్షియల్ పేటెంట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కింద ఈ భారీ మొత్తాన్ని షియామీ ఈ చెల్లింపులు జరిపింది. ఈ ఆరోపణలతో షియామీకి చెందిన రూ.5,551.3 కోట్లను ఈడీ సీజ్ చేసింది.