వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని ఎపి ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మంగళవారం అమరావతిలోని తాడేపల్లి సిఎం క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ మేరకు 2,79,065 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.590.91 కోట్లను వర్చువల్ పద్ధతిలో సిఎం జగన్ జమ చేశారు. వివిధ కారణాలతో పథకాలు అందక మిగిలిన పోయిన అర్హులకు ప్రభుత్వం చేయూత అందిస్తోంది. ఈ సందర్భంగా సిఎం జగన్ కొన్ని మీడియా సంస్థలపై ధ్వజమెత్తిన ఆయన పెన్షన్లపై విపక్షాలతో కలిసి కొన్ని పత్రికల్లో తప్పుడు వార్తలు వస్తున్నాయన్నారు.