ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ సిఎం వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఊళ్ళ చంటి అనే వ్యక్తి ఈ విగ్రహాన్ని తొలగించి ఆపై తాళ్ళు కట్టి రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాడు. దీంతో వైఎస్సార్ అభిమానులు చంటిపై దాడి చేశారు. అతడికి మతి స్థిమితం లేనందువల్లే ఈ పనికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు చేరుకున్నారు.