వచ్చే నెల 10న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ పార్టీ ఎన్నికలు జరగనున్న 4 స్థానాలను స్వీప్ చేయనుంది! ప్రస్తుతం వైఎస్సార్సిపికి అసెంబ్లీలో ఉన్న బలం దృష్ట్యా ఈ నాలుగు సీట్లూ జగన్ పార్టీ దక్కించుకోనున్నారు. టిడిపికి కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉండడంతో వారికి ఒక్క సీటూ దక్కకపోవచ్చు. దీంతో ఈ ఎన్నికల్లో టిడిపి అసలు అభ్యర్ధిని నిలబెట్టే ఆలోచన చేయదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎపి నుంచి ఈసారి అదానీ కుటుంబంలో ఒకరు రాజ్యసభకు వెళ్ళనున్నారు!