రాజమండ్రి: జీవో నెం.1 పక్కన పెట్టి రోడ్డుపై ర్యాలీ చేసిన వైకాపా ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి

By udayam on January 9th / 10:23 am IST

జీవో నెం.1 తమ కోసం కాదన్నట్టుగా వైసీపీ లీడర్లు ఎక్కడపడితే అక్కడ భారీగా రోడ్డు షోలు నిర్వహిస్తున్నారు. తాజాగా రాజమండ్రి కొంతమూరు బ్రిడ్జి నుంచి కోరుకొండ మండలం గాడాల వరకు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ రోడ్డు షోలో ఉపముఖ్యమంత్రి ముత్యాల నాయుడు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి , ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరోవైపు విమానాశ్రాయానికి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ట్యాగ్స్​