ఎపిలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించడం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు పాత్రపైనే డ్రైవర్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం రోడ్డు ప్రమాదంలో అతడు మరణించాడని ఎమ్మెల్సీ నుంచి ఫోన్ వచ్చిందని.. నిన్న అర్థరాత్రి 2 గంటలకు సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తమ ఇంటి వద్ద దించి ఎమ్మెల్సీ వెళ్ళిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.