రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు విజయసాయి రెడ్డి, ఆర్.కృష్ణయ్య, నిరంజన్రెడ్డి, బీద మస్తాన్లు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పీవీ సుబ్బారెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఏపీలో ఖాళీ కానున్న ఈ నాలుగు స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు మంగళవారం రిటర్నింగ్ అధికారి పీవీ సుబ్బారెడ్డి నోటిఫికేషన్ను జారీచేశారు. వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది!