ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైకాపా.. తన డ్రైవర్ను హత్య చేసిన కేసులో నిందితుడుగా ఉన్న సొంత ఎమ్మెల్సీ అనంత బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. డ్రైవర్ను తానే చంపినట్లు ఎమ్మెల్సీ ఒప్పుకోవడంతో పార్టీ అతడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ హత్య కేసు కాకినాడలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజలు సైతం అనంతబాబును అరెస్ట్ చేయాలంటూ ఉద్యమించారు. దీంతో ఎమ్మెల్సీ సోమవారం ఉదయం పోలీసుల ఎదుట లొంగిపోయారు.